కాంగ్రెస్ సర్కార్ భారీ ప్లాన్.. ఊహించని రేంజ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..!

by Satheesh |
కాంగ్రెస్ సర్కార్ భారీ ప్లాన్.. ఊహించని రేంజ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సీఎస్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 2న ఉదయం గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారని అన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. జూన్ 2 రాత్రి 7 గంటల నుండి 9 వరకు ట్యాంక్ బండ్‌పై కళారూపాల కార్నివాల్ ఉంటుందని తెలిపారు.

5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారన్నారు. అదే విధంగా ట్యాంక్ బండ్‌పై హస్త కళలు, చేనేత కళలు స్టాళ్లు, స్వయం సహాయక బృందాల స్టాళ్లు, నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలతో పాటు, బాణాసంచా, లేజర్ షో ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు. కాగా, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని చీఫ్ గెస్ట్‌గా పిలవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సోనియా గాంధీ వస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Next Story

Most Viewed