బీజేపీపై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఫైర్

by Disha Web Desk 4 |
బీజేపీపై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఫైర్
X

దిశ, కరీంనగర్ టౌన్ : మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ఈడి, ఐటి దాడుల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని మండిపడ్డారు. మేని ఫెస్టోలోని పథకాలను అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, నరేంద్ర మోడీకి మోసాల మోడీ అని నామకరణం చేయాలని సూచించారు. రాజ్యాంగాన్ని మార్చడం సిగ్గుచేటు అని, దేశ సంపద కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టకుండా ప్రజలందరికీ చెందాలని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్ష రాజకీయాలు చేయాలి గాని, సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, గుంటి వేణు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, గడిపె మల్లేష్, ఆదరి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, గొడిశెల తిరుపతి గౌడ్, పైడిపెల్లి రాజు, మంద సుదర్శన్, కంది రవీందర్ రెడ్డి, బ్రామాండ్ల పెల్లి యుగేందర్, ముద్రకోల రాజయ్య, న్యాలపట్ల రాజు, చెంచల మురళి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.



Next Story