- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: లోక్సభ ఎన్నికల వేళ కారు పార్టీకి ఝలక్.. కాంగ్రెస్లో చేరిన మరో కీలక నేత
దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీ నేతలు వరుసగా షాకులిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆమెకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ను వీడిన కడియం శ్రీహరిపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కడియం కూతురు కావ్యను ఓడించేందుకు కేసీఆర్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోని కీలక నేత, మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. రానున్న రోజుల్లో కడియం కావ్యను ఓడించేందుకు కేసీఆర్ మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.