పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో బీజేపీదే విజయం!.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

by Disha Web Desk 5 |
పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో బీజేపీదే విజయం!.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో తెలంగాణలో బీజేపీ పెద్ద విజయం సాధిస్తుందని అంచనా వేసిందని చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ ప్రీ పోల్ సర్వేపై స్పందించిన ఆయన సర్వే ఫలితాలపై ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పోల్ స్ట్రాటజీ గ్రూప్ (పిఎస్‌జి) చేసిన సర్వే తెలంగాణలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి అనుకూలంగా ఉందని అన్నారు. అంతేగాక తెలంగాణలో బీజేపీ అతి పెద్ద విజయం సాధిస్తుందని గ్రూప్ అంచనా వేసిందని పేర్కొన్నారు. పోలింగ్‌కు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన సర్వే బీజేపీకి భారీ లాభాలను అంచనా వేయడానికి సహాయపడిందని. పీఎస్‌జీ గ్రూప్ చేసిన కొత్త ప్రీ-పోల్ సర్వే తెలంగాణలో బిజెపికి పెద్ద విజయాన్ని అంచనా వేయడమే కాకుండా చేవెళ్లలో బీజేపీకి భారీ విజయాన్ని అంచనా వేసిందని, ఇది లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజల మానసిక స్థితిని ప్రతిబింబించేలా చేస్తుందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

కాగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే నిర్వహించి ఫలితాలను వెళ్లడించింది. ఈ ఫలితాల్లో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు ఉండబోతోందని తెలిపింది. అంతేగాక కాంగ్రెస్, బీజేపీ చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకుంటుందని అంచనా వేసింది. మరో మూడు స్థానాల్లో బీజేపీ ఎడ్జ్ మార్జిన్ తో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ కూడా మూడు సెగ్మెంట్లలో ఎడ్జ్ మార్జిన్ లో ఉంటుందని అంచనాలో పేర్కొంది. బీజేపీ గెలుస్తుందని అంచనా వేసిన లోక్ సభ స్థానాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది.

Next Story

Most Viewed