కేటీఆర్ కు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్!

by Dishafeatures2 |
కేటీఆర్ కు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ, వెబ్ డెస్క్: డ్రగ్ పరీక్షకు కావాలంటే తన వెంట్రుకలు, రక్తం, కిడ్నీలు ఇస్తానని.. తాను నిర్దోషినని తేలితే బండి సంజయ్ చెప్పు దెబ్బలు తింటారా అని కేటీఆర్ సవాలు విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్ టెస్ట్ కోసం కేటీఆర్ కిడ్నీలు తమకెందుకని, ఆయనకు డయాబెటిస్ ఉందని ఎద్దేవా చేశారు. ఆయన బొచ్చు, గొర్లు తమకు అవసరం లేదని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఎప్పుడైనా తన మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ తో ఇలాగే సవాలు చేసి ఓడిన కేటీఆర్.. ఇంతవరకు తన వెంట్రుకలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కేటీఆర్ కు లవంగాకు తంబాకుకు తేడా తెలియదని, బండి సంజయ్ పై అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేటీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి కాదని అర్వింద్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరద బాధితులందరికీ రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్ ఎన్నికల తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఉచిత ఎరువులు.. ఇలా ఏ హామీని కేటీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఓ బాధ్యత గల మంత్రిగా, సీఎం కుమారుడిగా కేటీఆర్ తన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయని, లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత దోషి అని తేలితే జైలుకు పోతుందని చెప్పారు.



Next Story

Most Viewed