సికింద్రాబాద్ కంటోన్మోంట్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్ధి ప్రకటన

by Disha Web Desk 5 |
సికింద్రాబాద్ కంటోన్మోంట్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్ధి ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు సంబందించి బీజేపీ తరుపున పోటీ చేయబోయే అభ్యర్ధిని ప్రకటించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే ఉపఎన్నికలకు సంబందించి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ.. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డా. టీఎన్ వంశా తిలక్ పేరును ప్రకటించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా.. ఉప ఎన్నిక అభ్యర్ధి కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేసిన రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్ ను అధిష్టానానికి పంపింది. దీనిపై అధిష్టానం చర్చించి వంశీ తిలక్ పేరును ఫైనల్ చేసింది.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిన కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తధ్యం అయ్యింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి అయిన నివేదితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఇక కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ అభ్యర్ధి శ్రీ గణేషన్ నారాయణన్ పార్టీలో చేర్చుకొని ఆయనను అభ్యర్ధిగా ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story