BIG News: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఏకంగా 20 మందికి స్థాన చలనం

by Shiva |   ( Updated:2024-06-15 09:00:48.0  )
BIG News: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఏకంగా 20 మందికి స్థాన చలనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. మొత్తం 20 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ.. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్‌గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్‌ జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్‌ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆశీన్ సంగ్వాన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, నారాయణ పేట్ జిల్లాకు సక్తా పట్నాయక్, హనుమకొండ జిల్లాకు ప్రావిణ్య, జగిత్యాల జిల్లాకు సత్య ప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లాకు విజియేంద్ర, మంచిర్యాల జిల్లాకు దీపక్, వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్, నల్లగొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు అదర్శ్ సురభి, సూర్యాపేటకు తేజస్ నంద్‌లాల్ పవార్, వరంగల్ జిల్లాకు సత్య శారదా దేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్‌, పెద్దపల్లి కలెక్టర్‌గా కోయా శ్రీహర్షను నియమిస్తూ కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Next Story