ఈ రోజు నామినేషన్ వేయనున్న బండి సంజయ్

by Disha Web Desk 12 |
ఈ రోజు నామినేషన్ వేయనున్న బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మొదటి అంకం పూర్తి కావొస్తోంది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు నామినేషన్లకు చివరి రోజు రోజు కావడంతో భారీ ఎత్తున నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధాన పార్టీలతో పాటు.. స్వాతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్దమయ్యారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రజల చూపు మొత్తం కరీంనగర్ వైపు ఉంది. బీజేపీ ఎంపీ, బండి సంజయ్ ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో స్వచ్చందంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. తమ బలం నిరూపించాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి బండి అభిమానులు కరీంనగర్ బాట పట్టారు. దీంతో ఈ రోజు కరీంనగర్‌లో బండి నామినేషన్ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ముఖ్య అతిథిలుగా పాల్గోననున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed