Bandi Sanjay: KCR ఫాంహౌజ్‌కు ఫ్రీగా కరెంట్.. బండి సంచలన ఆరోపణలు

by Disha Web Desk 4 |
Bandi Sanjay: KCR ఫాంహౌజ్‌కు ఫ్రీగా కరెంట్.. బండి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: CM KCR తన ఫామ్ హౌజ్‌లో వాడే కరెంట్‌తో 30 గ్రామాలకు ఉచితంగా కరెంట్ సరఫరా చేయవచ్చని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్... అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై ప్రభుత్వం భారం మోపి సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు, పెన్షన్ డబ్బులు వేయలేదని అన్నారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలు చేస్తూ.. ఇళ్లకు మాత్రం కరెంట్ ఛార్జీలను పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన ఫామ్ హౌజ్ కోసం ఫ్రీగా కరెంట్ వాడుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు చెందిన ఫామ్ హౌజ్ లలో ఒక్కొక్కరికి 30 కనెక్షన్లు ఉన్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫామ్ హౌజ్ లకు వాడే కరెంట్ తో 100 గ్రామాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వవచ్చని సూచించారు. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు.


Next Story

Most Viewed