- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. తెరపైకి మరో ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు..!
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఇద్దరిని కేసు విచారణం బృందం ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుతో వారికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్న ఇద్దరు అధికారులను విచారిస్తున్నారని సమాచారం.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల పేర్లను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో మరో ఇద్దరు పోలీసు అధికారుల పేర్ల తెరపైకి రావడం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.