- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రుణమాఫీ నిధుల విషయంలో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
దిశ, వెబ్డెస్క్: రైతుల రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. అయితే గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ సర్కారు నిధుల సమీకరణపై ఫోకస్ పెంచింది. అయితే ప్రభుత్వ భూములను కుదవపెట్టి లోన్లు తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 760 ఎకరాల భూమిని సైతం ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. రూ.48వేల కోట్ల భూములను తనఖా పెట్టడం ద్వారా రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్లు ఏక కాలంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం అమ్మి పథకాలను ఇంప్లిమెంట్ చేయగా.. భూములను అమ్మడం కన్నా తనఖా పెట్టడం మేలని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ వద్ద ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అంశం చర్చకు రాగా.. ఈ భూములను తనాఖా పెట్టి నిధులు సమకూర్చుకుంటే ఎలా బాగుంటుందని సీఎం అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.