- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మజ్లిస్కు భయపడే BRS, కాంగ్రెస్ అలా చేస్తున్నాయి.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గురువారం సిద్ధిపేటలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. మోడీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు. దేశంలో 400 కు పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించాలన్నారు. అయోధ్యలో రామమందిరం కోసం మోడీ కృషి చేశారన్నారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు మోడీ కృషి చేస్తారన్నారు. తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందన్నారు.
మజ్లిస్కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదన్నారు. బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. పదేళ్లలో దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరిమచాని.. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ను తొలగించామన్నారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారన్నారు. మరోసారి మోడీ ప్రధాని అయితే.. తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తారన్నారు. సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమన్నారు.