హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తా : ఎమ్మెల్సీ దండె విఠల్

by Disha Web Desk 11 |
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తా : ఎమ్మెల్సీ దండె విఠల్
X

దిశ, బెజ్జూర్ : హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. 2022 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగా జరగలేదనే కారణంతో ఈ తీర్పు వచ్చిందని, అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నాకు సంబంధం లేని వ్యవహారమని అన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు. ఏది ఏమైనా ఈ తీర్పుపై అప్పీల్ కు నాకు నాలుగు వారాల గడువు లభించిందన్నారు. నాకు సుప్రీం కోర్టులో న్యాయం జరిగి ,హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని, చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.

Next Story

Most Viewed