మహాత్మా ఫూలే, సావిత్రిబాయి విగ్రహాలు ధ్వంసం

by Mahesh |
మహాత్మా ఫూలే, సావిత్రిబాయి విగ్రహాలు ధ్వంసం
X

దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి లో సావిత్రి బాయి, జ్యోతి రావు పూలే విగ్రహాలను దుండగుడు ధ్వంసం చేశారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో, విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన కోటపల్లి పోలీసులు.విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉడత బాపు గా గుర్తించారు. తాగిన మైకంలో ఘటన జరిగినట్లు సమాచారం.



Next Story

Most Viewed