ప్రభుత్వాలు మారినా బాసర ట్రిపుల్ ఐటీలో ఆగని ఆత్మహత్యలు..

by Disha Web Desk 23 |
ప్రభుత్వాలు మారినా బాసర ట్రిపుల్ ఐటీలో ఆగని ఆత్మహత్యలు..
X

దిశ,భైంసా : ప్రభుత్వాలు మారినా బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలు మారడం లేదంటూ... నేడు అందరి నోట..! ఇదే మాట..! ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో పీయుసీ రెండవ సంవత్సరం చదువుతున్న బుచ్చుక అరవింద్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.స్థానికులు, ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపిన కథనం ప్రకారం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని వాపోతున్నారు. సోమవారం అర్ధరాత్రి బలవన్మరణానికి పాల్పడినట్టు పలువురు వాపోగా.... ట్రిపుల్ ఐటీ అధికారులు మంగళవారం ఉదయం ఇట్టి విషయాన్ని తెలపడం గమనార్హం.విద్యార్థి మృతి చెందిన విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.యూనివర్సిటీ సిబ్బంది,విద్యార్థి మృతి పట్ల వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని ట్రిపుల్ ఐటీ పీఆర్వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మృతుడు బండారుపల్లి గ్రామం, తోగుంట మండలం రంగారెడ్డి జిల్లాకు చెందినవారు.


Next Story