- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘బహుజన ద్రోహి గో బ్యాక్’.. RS ప్రవీణ్ కుమార్కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో పోస్టర్లు వెలిశాయి. ‘బహుజన ద్రోహి ఆర్ఎస్పీ గో బ్యాక్’ అంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. కొమురం భీం జిల్లా కౌటల మండల కేంద్రంలో ఇవి దర్శనమిచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ సిర్పూరు నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ పొత్తును పార్టీ చీఫ్ మాయావతి వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రవీణ్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
ఆయన బీఆర్ఎస్లో చేరడంతో సిర్పూరు నియోజకవర్గంలో బీఎస్పీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోసం తాము ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డామని కానీ ఆయన కనీసం తమకు మాట మాత్రమైనా చెప్పకుండా బీఆర్ఎస్లో చేరడం ఏమిటని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు సిర్పూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ హాజరుకానున్నారు. దీంతో ఈ పోస్టర్లు వెలువడటం కలకలం రేపింది.