స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన వ్యక్తి

by Disha Web Desk 9 |
స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన వ్యక్తి
X

దిశ, చేవెళ్ల: స్నానానికి వెళ్లిన తాపీ మేస్త్రి గుండంలో మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన చేవెళ్లలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లా సొంతరావ్ గ్రామానికి చెందిన తానే రవి (38) బ్రతుకు దెరువు కోసం గత 20 ఏళ్ల నుంచి రాజేంద్రనగర్ మండల్ బండ్లగూడ ప్రాంతంలోని కాళీమందిర్నివాసం ఉంటున్నారు. రవి తాపీ మేస్త్రి కావడంతో షాబాద్ మండలంలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామంలో ఇల్లు పని గుత్తకుతీకొని పనిచేస్తున్నాడు.

శుక్రవారం సాయంత్రం పని ముగిసాకా చేవెళ్లకు వచ్చాడు. అనంతరం పుష్కరిణిలో స్నానం చేసేందుకు వెళ్ళాడు. అతనితో పాటు మరో ఇద్దరు స్నానం కోసం గుండంలోకి దిగారు. గుండం వొడ్డున స్నానం చేస్తుండగా, రవి మాత్రం గుండం మధ్యలోకి వెళ్లాడు. అతనికి ఈత వచ్చినప్పటికీ ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. మద్యం సేవించి ఉండడంతో దమ్ము ఆడక గుండంలోకి మునిగిపోయాడు. వడ్డున ఉన్న అతని కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండపోయింది. జరిగినా విషయాన్ని వెంటనే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు పలుమార్లు తెలిపిన వారు పట్టించుకోలేదని నిర్లక్ష్యంగా వివరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు గుండం వద్ద కుటుంబ సభ్యులు రవి కోసం గాలించారు. విషయం తెలుసున్న సీఐ లక్ష్మారెడ్డి శనివారం మధ్యాహ్నం గుండం వద్దకు చేరుకొని పరిస్థితి తెలుసున్నారు. మృతదేహం పైకి తెలకపోవడంతో గజఈతగలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story

Most Viewed