CPI ఎమ్మెల్యే కూనం‌నేని సాంబశివరావుపై కేసు నమోదు

by Disha Web Desk 4 |
CPI ఎమ్మెల్యే కూనం‌నేని సాంబశివరావుపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీపీఐ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీకి కూనంనేనిపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆధారాలు అధికారులకు అందజేశారు. ఈ ఫిర్యాదుతో పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఆదేశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదులో ఎంపీడీవో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్ పెట్టారని ఆరోపించారు. కూనంనేనిపై 188, 171-సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed