- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం పేరుతో ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. రాఖీపౌర్ణమి సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దిశ చట్టంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. 60 ఏళ్ల వృద్ధురాలు నుంచి ఆరేళ్ల పసిపాపల వరకు ఎవరికీ రక్షణ లేదని శిరీష ఆరోపించారు. రాష్ట్రంలో రాఖీ శుభాకాంక్షలు తెలిపే పరిస్థితులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఆడబిడ్డలంటే సీఎంకు ఎందుకంత అలుసో అర్థం కావడం లేదని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మృగాళ్ల బారినపడిన బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక కూడా ఈ ముఖ్యమంత్రికి దొరకడం లేదని విమర్శించారు. బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టినంత మాత్రాన వారికి న్యాయం చేసినట్లు కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 500 మందికిపైగా ఆడవారిపై దాడులు జరిగాయని.. ఇప్పటి వరకు ఒక్క బాధితురాలికి న్యాయం జరగలేదని గౌతు శిరీష మండిపడ్డారు.