- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: దర్శకుడు వెంకీ కుడుముల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు సెలెక్ట్ అయిందని, ఆరు కేటగిరీల్లో నామినేషన్ వేయాలని సైబర్ నేరగాడు తనకు ఫోన్ చేయడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఎకౌంట్లో డబ్బులు జమ చేశాడు దర్శకుడు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ ఘటనపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. వెంకీ కుడుముల పవన్ ఫ్యాన్ కావడంతో.. ఎప్పుడూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసే శ్రీరెడ్డి ఈ సందర్భాన్ని వదులుకోలేకపోయింది. అందుకే పవన్ ఫ్యాన్స్ అంటూ ఇండైరెక్ట్ సెటైర్స్ వేసింది. పవన్ అభిమానులంతా ఇలాంటి బుర్ర తక్కువ వాళ్లేనని ట్వీట్ చేసింది. ఇక్కడ నితిన్ పేరు కూడా యాడ్ చేసిన శ్రీరెడ్డి.. ‘వకీల్ సాబ్ గారు వీలైతే ఈ కేసు వాదించండి’ అని పోస్ట్ పెట్టింది.