- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టేబుల్ టెన్నిస్ టోర్నీలో మానవ్ జోరు
by Dishanational3 |
X
దిశ, స్పోర్ట్స్ : చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ హవిరోవ్ టోర్నీలో భారత ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్లో ఆదివారం జరిగిన మూడో రౌండ్లో మానవ్ 3-2(8-11, 9-11, 11-9, 11-3, 13-11) తేడాతో ఆస్ట్రియా ప్లేయర్ ఆండ్రియాస్ లెవెంకోను ఓడించాడు. ఈ మ్యాచ్లో మొదట మానవ్ వరుసగా తొలి రెండు గేమ్లు కోల్పోయి తడబడ్డాడు. ఆ తర్వాత అతను పుంజుకున్న తీరు అద్భుతం. ప్రత్యర్థిని నిలువరించిన అతను వరుసగా మూడు గేమ్లను గెలుచుకుని మ్యాచ్ను దక్కించుకున్నాడు. మరో మ్యా్చ్లో భారత స్టార్ ఆటగాడు సత్యన్ జ్ఞానేశ్వర్ నిరాశపరిచాడు. స్పెయిన్ ఆటగాడు అల్వారో రాబుల్స్ చేతిలో 3-1(11-9, 6-11, 12-10, 11-9) తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.
Next Story