- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారత్దే బోణీ.. బంగ్లాను చిత్తు చేసిన మహిళల జట్టు
దిశ, స్పోర్ట్స్ : ఐదు టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల క్రికెట్ జట్టు సిరీస్లో శుభారంభం చేసింది. సిల్హెట్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. స్మృతి మంధాన(9) నిరాశపర్చినా.. యాస్తికా భాటియా(36), షెఫాలీ వర్మ(31), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(30) సత్తాచాటారు. రిచా గోష్(23) విలువైన పరుగులు జోడించడంతో జట్టు పోరాడే స్కోరు సాధించింది. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్(3/23) సత్తాచాటింది.
అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని నిలువరించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో బంగ్లాదేశ్ 101/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ నిగర్ సుల్తానా(51) హాఫ్ సెంచరీతో రాణించినా.. మిగతా వారు భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలువలేకపోయారు. రేణుక సింగ్(3/18), పూజా వస్త్రాకర్(2/25) తమ పేస్తో బంగ్లా పతనాన్ని శాసించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, రాధా యాదవ్లకు చెరో వికెట్ దక్కింది. మంగళవారం రెండో టీ20 జరగనుంది.
- Tags
- #BAN-W vs IND-W