- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, వరంగల్ : దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై అదే స్టేషన్లో ఎస్హెచ్వోగా పనిచేస్తున్న అధికారి అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ దారుణ సంఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ స్టేషన్లో సోమవారం రాత్రి జరిగినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో మహిళా ట్రెయినీ ఎస్సైని ఒంటరిగా వాహనంలో తీసుకెళ్లిన ఎస్హెచ్వో ఆమెపై విచక్షణా రహితంగా లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఎలాగొలా అధికారి చెర నుంచి తప్పించుకున్న మహిళా అధికారిణి మంగళవారం ఉదయం వరంగల్ కమిషనర్తరుణ్ జోషికి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.
అయితే రాత పూర్వకంగా కాకుండా ఓరాల్గా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ట్రెయినీ ఎస్సైని వాట్సాప్, ఫోన్ కాల్ ద్వారా కూడా వేధించాడని, తాజాగా ఈ దారుణం చేశాడని సమాచారం. వరంగల్ సీపీ పరిధిలో పోస్టింగ్ తీసుకున్న సదరు మహిళా అధికారిణి ఎస్హెచ్వోలున్న స్టేషన్లో నెల రోజులు ప్రొహిబిషన్ పీరియడ్ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కమిషనరేట్ పరిధిలో లేని స్టేషన్లో ప్రొహిబిషన్ ఎస్సైగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అధికారిణిపై కన్నేసిన ఎస్హెచ్వో సోమవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది.