హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ నేత

by  |
raghurama krishnam raju,
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసేందుకు వెళ్తున్న నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో తాను విజయం సాధించానని, తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసులు ఇచ్చారని.. దీనిపై క్లారిటీ వచ్చే వరకు తనపై చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయ స్థానాన్ని కోరారు.



Next Story