వారికి ఏప్రిల్ నుంచే రూ.2 వేలు

by  |
వారికి ఏప్రిల్ నుంచే రూ.2 వేలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు స్కూల్స్ మూతపడటంతో జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేలు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని విధివిధానాలపై చర్చించేందుకు ఇవాళ మంత్రులు సమావేశమయ్యారు. ఏప్రిల్ నుంచే సాయం అందించాలని నిర్ణయించారు.

దీని కోసం నెలకు రూ.42 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రైవేట్ స్కూళ్లల్లో 1.45 లక్షల మంది పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. రేషన్ దుకాణాల వారీగా అర్హులను గుర్తించారు సమీక్షలో నిర్ణయించారు.

Next Story

Most Viewed