- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. తెలుగు తెర నుంచి పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ వెలిగిపోయాడు. 41 ఏళ్ల ఈ యంగ్ బ్యాచిలర్ హీరో ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద ప్రాజెక్ట్ ప్రకటనలు, పాన్-ఇండియా చిత్రాల లైనప్తో అందర్నీ తన వైపు తిప్పుకున్నాడు. మరోవైపు ప్రభాస్ నూతన చిత్రం రాధేశ్యామ్ విడుదలకు సిద్ధం ఉండగా.. ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ప్రభాస్.. తాజాగా తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు సమాచారం.
ఇప్పటికే ప్రభాస్ తను చేసే ప్రతి ఒక్క సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ సందీప్ రెడ్డి వంగా సినిమా కోసం అతను రూ.150 కోట్లు కోట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ కోట్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం సలార్ షూటింగ్లో బిజీగా ఉన్న ఈ హీరో.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రం షూటింగ్ను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.
మరోవైపు తన రాబోయే ప్రాజెక్ట్ల కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదలకు సిద్ధం అవుతోంది.