శ్రీశైలం ఘటన: ఐదుగురి మృతదేహాలు లభ్యం

by  |
శ్రీశైలం ఘటన: ఐదుగురి మృతదేహాలు లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదానికి గురై సొరంగంలో చిక్కుక్కున్న 9 మంది ఉద్యోగుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ ఐదుగురి మృతదేహాల్లో ఒకరు అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ గా గుర్తించారు. సుందర్.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్ తండా వాసిగా గుర్తించారు. మిగతా వారి కోసం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ఉదయం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.



Next Story