మహబూబ్ నగర్‌లో రక్తసిక్తమైన రహదారులు.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

by  |
మహబూబ్ నగర్‌లో రక్తసిక్తమైన రహదారులు.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
X

దిశ, చిన్న చింతకుంట : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిన్నచింతకుంట మండల పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దేవరకద్ర నుంచి జాతర రూట్‌లో పల్సర్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు అతివేగంగా వస్తున్నారు.

అనుకోకుండా తిరుమలాపూర్ శివార్లలో అదుపు తప్పి కింద పడిపోవడంతో ప్రమాదవశాత్తు రామాంజనేయులు మృతి చెందగా ఓంకార్, రాములు తీవ్రగాయాల పాలయ్యారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కాగా, నెల్లికొండి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.



Next Story

Most Viewed