- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 68,829 మందికి పరీక్షలు నిర్వహించగా 7,553మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,39,302కి చేరింది. 51 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,461కి చేరింది. ప్రస్తుతం 71,465 యాక్టివ్ కేసులు ఉండగా చికిత్స తీసుకొని 5,62,376 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 10,555 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 52,29,529 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో ఎనిమిది ప్రాణాలు కోల్పోగా అనంతపురంలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చనిపోయారు.
అనంతపురం జిల్లాలో 309 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 902, తూర్పుగోదావరిలో 1,166, గుంటూరులో 606, కడపలో 589, కృష్ణాలో 384, కర్నూలులో 272, నెల్లూరులో 556, ప్రకాశంలో 672, శ్రీకాకుళంలో 347, విశాఖపట్నంలో 410, విజయనగరంలో 391, పశ్చిమగోదావరి జిల్లాలో 989 కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.