- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దామరచర్ల: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం లావూరితండాకు చెందిన నిఖిల్ సత్తా చాటాడు. గత సెప్టెంబర్ నెలలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్టేట్ లెవెల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పొల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అనంతరం అక్టోబర్ నెలలో గోవా వేదికగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ అద్భుతంగా రాణించాడు. దీంతో తాజాగా.. నిఖిల్ వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నేపాల్ వేదికగా జరిగే అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇంతటి కీర్తి సాధించినటువంటి నిఖిల్ను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అభినందించారు. అంతేగాకుండా.. గ్రామ సర్పంచ్ హర్షం వ్యక్తం చేస్తూ గర్వంగా ఉందని ప్రశంసించారు. మారుమూల ప్రాంతానికి చెందిన విద్యార్థి నిఖిల్ అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలకు ఎంపిక కావడంతో సన్మానం చేశారు. దేశం తరపున, తెలంగాణ రాష్ట్రం తరపున అఖిల్ అద్భుతమైన ప్రదర్శన చేయాలని కోరారు.