ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు..!

by  |
ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు..!
X

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. నగరపాలక సంస్థ ఏర్పాటు తరువాత తొలిసారి ఐఏఎస్ జితేష్ వి పాటిల్ కమిషనర్‌గా నియమితులు అయ్యారు. విధులలో చేరిన రెండో రోజు ఉదయం 5గంటలకే నగరంలోని మున్సిపల్ సర్కిల్‌లో ఉద్యోగుల హాజరు పరిశీలన చేశారు. రోజు వారి విధులు అడిగి తెలుసుకున్నారు. కమిషనర్, నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి శ్రీనివాస్ ఇరువురు కాలనీలను పర్యవేక్షించారు.

Next Story

Most Viewed