అమూల్ బేబీస్.. గాంధీలపై హిమంత బిశ్వ శర్మ కామెంట్స్..!

by Dishanational6 |
అమూల్ బేబీస్.. గాంధీలపై హిమంత బిశ్వ శర్మ కామెంట్స్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రియాంక గాంధీ రోడ్ షోకు వెళ్లేకన్నా.. ప్రజలు కజరంగా పార్కుకు వెళ్లి పులులు, ఖడ్గమృగాలను చూడటం ప్రయోజనకరం అన్నారు. ప్రియాంక రోడ్ షోలో సుమారు 3వేల మంది హాజరైనట్లు విన్నానని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీని చూసేందుకు ఎవరు వస్తారని ఎద్దేవా చేశారు. దానికన్నా కజిరంగా పార్కుకు వెళ్లి పులుపు, ఖడ్గమృగాలను చూడటం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నారు. అసోంలోని మజులిలో ఎన్నికల బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హిమంత బిశ్వశర్మ.

గాంధీ కుటుంబ సభ్యులు కేవలం ప్రకటనలు, ప్రచారాలకు మాత్రమే సరిపోతారని విమర్శించారు. గాంధీ కుటుంబాన్ని చూసి ఏం లాభం.. అమూల్ బేబీస్.. ఆ ప్రచారానికి ఫిట్‌గా కనిపిస్తారని చురకలు అంటించారు. అమూల్ బేబీ స్ ని కళ్లారా చూడటం కంటే కజిరంగాలోని ఖడ్గమృగాలను చూడటం లాభదాయకం అని అన్నారు.

ఇక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ గురించి విమర్శలు చేశారు. గౌరవ్ గొగోయ్ చురుకైన పార్లమెంటేరియన్ అని కొందరు చెప్పాలనుకుంటున్నారని అన్నారు. కలియాబోర్ నియోజకవర్గం కోసం ఆయన మాట్లాడిన ఒక్క మాటనైనా తనకు చూపించగలరా అని సవాలు విసిరారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అని అరవడానికి చురుకైన పార్లమెంటేరియన్ అవసరం లేదని.. అసోం సమస్యలపై మాట్లాడే పార్లమెంటేరియన్ కావాలని స్పష్టం చేశారు.


Next Story