యాభై ఏళ్ల వయసులో తండ్రైన సీఎం.. ఎక్కడంటే..?

by Disha Web Desk 18 |
యాభై ఏళ్ల వయసులో తండ్రైన సీఎం.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. యాభై ఏళ్ల వయసులో సీఎం భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సీఎం దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, భగంత్ మాన్ తన మాజీ భార్య ఇంద్ర ప్రీత్ కౌర్‌తో 2015లో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం భగంత్ మాన్ 2022లో డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా గుర్ ప్రీత్ కౌర్ బిడ్డకు జన్మనిచ్చింది.


Next Story

Most Viewed