కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

by Disha Web Desk 21 |
కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
X

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆదివారం కుప్వారాలోని టెక్రీ‌నర్ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల నుంచి 2 ఏకే 47 రైఫిల్స్, 2 తుపాకులు, 4 హ్యండ్ గ్రేనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదుల్లో స్పష్టత ఇవ్వలేదు. అంతకముందు రోజు ఉగ్రవాదులు వలస కూలీలపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 రోజుల క్రితం నౌగామ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.


Next Story

Most Viewed