చైనా సరిహద్దుల్లో ఇద్దరు అరుణాచల్ ప్రదేశ్ యువకులు మిస్సింగ్!

by Disha Web Desk 21 |
చైనా సరిహద్దుల్లో ఇద్దరు అరుణాచల్ ప్రదేశ్ యువకులు మిస్సింగ్!
X

ఈటానగర్: చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అంజా జిల్లాలో ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. ఔషధ మూలికల కోసం వెతుకుతూ వెళ్లిన బటేలమ్ టిక్రో, బేయింగ్సో మన్యు అచూకీ మిస్ అయ్యారని పోలీసులు తెలిపారు. వాస్తవానికి వీరిద్దరూ ఆగస్టు 19న ఇంటిని వీడగా, ఈ నెల 9న వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చైనా సరిహద్దు దాటినట్లు అనుమానిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన అధికారులు ఆర్మీ, కేంద్రం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆగస్టు 24న వారు చివరిసారిగా కనిపించారని అధికారులు గుర్తించారు. మూలికలు, కూరగాయాలు ఇతరత్రాల కోసం అడవిలోకి వెళ్లే యువత అనుకోకుండా సరిహద్దు దాటుతున్నారని సామాజిక కార్యకర్త తబా టాకు అన్నారు. గతంలోనూ ఓ వ్యక్తి అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో చైనా దిగొచ్చి ఆ యువకుడిని విడుదల చేసింది. తాజాగా ఇద్దరు ఎటూ వెళ్లరనే విషయమై మిస్టరీగా మారింది.


Next Story

Most Viewed