రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి: రాహుల్ గాంధీ

by Disha Web Desk 12 |
రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి.. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేడు కేరళలోని వయనాడ్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ శక్తులు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీ, భారత కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్రధాని మోడీ దేశంలోని అత్యంత ధనవంతులను రక్షిస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. ప్రస్తుతం ఆయన ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గా కొనసాగుతున్నారు.


Next Story

Most Viewed