విలేకరుల సమావేశంలో వాగ్వాదం.. దాడి చేసుకున్న బీజేపీ నాయకులు

by Disha Web Desk 5 |
విలేకరుల సమావేశంలో వాగ్వాదం.. దాడి చేసుకున్న బీజేపీ నాయకులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇద్దరు బీజేపీ నాయకులు దాడి చేసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో బీజేపీ మేనిఫెస్టోపై మాట్లాడేందుకు మంత్రి బ్రిజేష్ సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సమావేశం జరిగిన కొద్ది సేపటికే జిల్లా మీడియా కోఆర్డినేటర్ రమేష్ కలాల్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్ మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తోపులాట జరిగింది. ఈ తోపులాట కాస్తా శారీరక హింసకు దారి తీసినట్లు తెలిసింది. దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. వీరి మధ్య పోలీస్ అధికారి వచ్చి ఆపే ప్రయత్నం చేసిన ఇరువురు వెనక్కి తగ్గడం లేదు. అనంతరం జిల్లా కార్యదర్శి రాకేష్‌ వర్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శుభం చౌదరి లు కలగజేసుకొని వివాదాన్ని పరిష్కరించినట్లు తెలిసింది.


Next Story

Most Viewed