నా పార్లమెంట్ పర్యటన ఒక అందమైన అనుభూతి: సుధా మూర్తి

by Disha Web Desk 12 |
నా పార్లమెంట్ పర్యటన ఒక అందమైన అనుభూతి: సుధా మూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కోటాలో ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌ సుధా ముర్తికి రాజ్యసభ ఎంపీ ఎన్నుకున్నారు. దీంతో ఆమె ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కాగా ఈ రోజు ఆమె మొట్ట మొదటి సారిగా పార్లమెంటులో అడుగుపెట్టి.. నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. అనంతరం బయటకు వచ్చి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు సుధా మూర్తి సమాధానాలు ఇస్తూ.. "నా పార్లమెంటు పర్యటన ఒక అందమైన అనుభూతి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ భవనం తో ముడిపడి ఉన్న కళ, సంస్కృతి, చరిత్ర నన్ను విస్మయానికి గురిచేసింది. దాని గుండా నడవడం ఒక కల నిజమైందని.. చాలా ఆనందంగా చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed