బీజేపీ ప్లాన్ అదే.. గుజరాత్ ఎన్నికల కోసమే ఇదంతా!

by Dishanational4 |
బీజేపీ ప్లాన్ అదే.. గుజరాత్ ఎన్నికల కోసమే ఇదంతా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంను మరోసారి విచారణకు సీబీఐ ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో తమ ముందు హాజరు కావాలని ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ కోరింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందిస్తూ.. మరికొద్ది రోజుల్లో గుజరాత్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను అరెస్టు చేయడానికి బీజేపీ ప్లాన్ చేస్తోందని విమర్శించారు. 'రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం కోసం నేను గుజరాత్ వెళ్లాల్సి ఉంది. నన్ను అరెస్టు చేయడానికి ప్లాన్ చేయండి. గుజరాత్ ఎన్నికలకు దూరంగా ఉంచండి. గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఆపడమే వారి ఉద్దేశం' అని మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed