పామును మేడ మీదకు తీసుకెళ్లి ముద్దాడబోయాడు.. చివరకు ఏం జరిగిందంటే..?

by Dishanational1 |
పామును మేడ మీదకు తీసుకెళ్లి ముద్దాడబోయాడు.. చివరకు ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: పాము అంటేనే భయపడుతుంటాం. కానీ, ఓ వ్యక్తి పామును ముద్దాడబోయి ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... నాశిక్ సిన్నర్ కు చెందిన నగేశ్ అనే వ్యక్తి పాములు పడుతుంటాడు. అయితే, ఇతను శుక్రవారం ఓ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును తీసుకుని తన స్నేహితుడి వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ పామును మేడపైకి తీసుకెళ్లి దానితో విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో అతను ఆ పామును ముద్దాడబోయాడు.. దీంతో ఆ పాము అతడి పెదవిపై కాటు వేసింది. వెంటనే అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందాడు.

Next Story

Most Viewed