న్యూస్ డిబేట్‌లో కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకుంటున్న లీడర్లు.. ఎక్కడంటే?

by Disha Web Desk 14 |
న్యూస్ డిబేట్‌లో కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకుంటున్న లీడర్లు.. ఎక్కడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో డీఎంకే, బీజేపీ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా న్యూస్ డిబేట్ షోలో ప్రత్యర్థి రాజకీయ పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఏప్రిల్ 6న కాంచీపురంలో న్యూస్ 18 తమిళనాడు ఛానల్ మక్కల్ సభై అనే లైవ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

ఈ ప్యానెల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే కింద కూర్చుని ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. అయితే ఈ గొడవకు కారణం ఏమిటనేది ప్రస్తుతం తెలియరాలేదు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed