- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ గుజరాత్లో రికార్డులు బ్రేక్ చేస్తుంది: కేంద్ర మంత్రి
గాంధీనగర్: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అన్నారు. మరోసారి రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీ చేపట్టిన గౌరవ్ యాత్రలో భాగంగా గుజరాత్ వల్సాద్ జిల్లాలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో హిందు చిహ్నాలకు గౌరవమివ్వడమే కాకుండా ఆయోధ్య రాంమందిర నిర్మాణం చేపట్టారని అన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ 2024 సాధారణ ఎన్నికల్లోనూ అధికారంలో వస్తుందని, 400కు పైగా పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇటాలియన్ మహిళ ప్రధానిని అవమానిస్తే, ప్రస్తుతం ఇటాలియా మోడీ తల్లిని అవమానించారని మండిపడ్డారు. గుజరాత్ గతంలోనూ అవమానాన్ని సహించలేదని, ఇప్పుడు కూడా సహించబోదని చెప్పారు. ప్రధాని మోడీ అవిష్కరించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఠాకూర్ ప్రశంసల్లో ముంచెత్తారు.