అపర కుబేరుడు మస్క్ తల్లి.. ఎక్కడికి వెళ్లారో తెలుసా ?

by Dishanational6 |
అపర కుబేరుడు మస్క్ తల్లి.. ఎక్కడికి వెళ్లారో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో: టెస్లా సీఈవో, మైక్రోబ్లాగింగ్‌ సంస్థ ఎక్స్‌ చీఫ్‌ ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ టెక్సాస్‌లోని టెస్లా గిగాఫ్యాక్టరీని సందర్శించారు. తన కుమారుడు మస్క్ తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మయే. ఫొటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షలకు పైగా వ్యూస్, 10 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. "లాబీ చాలా అందంగా ఉంది" అని ఆ ఫొటోకు ట్యాగ్ జతచేశారు మయే మస్క్. అంతకుముందు.. “మీరు శనివారం ఏం చేస్తారు? నేను మస్క్ లాబీతో కలిసి గిగా ఫ్యాక్టరీ కి వెళ్లాను. లాబీ చాలా అందంగా ఉంది.” అని సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చారు.

మయే మస్క్ కు ఫొటోకు ఎలాన్ మస్క్ హార్ట్ ఎమోజీతో పాటు రిప్లయ్ ఇచ్చారు. వర్క్ ప్లేస్ లో తను ఉన్నందుకు ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. మయే షేర్ చేసిన ఫొటోలు మస్క్ బ్లాక్ అండ్ బ్లాక్ డెనిమ్ ధరించగా.. మయే బ్లూ జీన్స్, బ్లూ డెనిమ్ దుస్తుల్లో ఉన్నారు.

మయే మస్క్ షేర్ చేసిన ఫొటోలపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆర్కిటెక్చర్ నెక్ట్స్ లెవల్ అని.. ఏదో ఒకరోజు ఆ ప్రాంతాన్ని సందర్శస్తాని కామెంట్ చేశాడు ఓ నెటిజన్. "మీరు, మీ కుమారుడు.. చాలా బాగుంది" అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు. మీరు నిజంగా అద్భుతమైన తల్లి అని మరొకరు రాసుకొచ్చారు.



Next Story