కర్ణాటకలో 150 సీట్లు గెలుస్తాం: డీకే శివకుమార్

by Disha Web Desk 21 |
కర్ణాటకలో 150 సీట్లు గెలుస్తాం: డీకే శివకుమార్
X

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరి మద్దతు లేకున్న ఇది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. బల్లారీలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఇతర పార్టీల మద్దతు లేకుండానే రాష్ట్రంలో 150 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని చెప్పారు. కర్ణాటక ప్రజలు 150 సీట్లకు స్పష్టమైన తీర్పును ఇస్తారని చెప్పారు.

ప్రజలు ఆర్థికంగా, యువత ఉద్యోగాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పిల్లలు, రైతులు, మహిళలు వారి సమస్యలతో రాహుల్ గాంధీని కలిసారని తెలిపారు. హృదయాలను ఏకం చేసేందుకు తాము యాత్ర చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40శాతం కమీషన్ అని ఆరోపిస్తూ కర్ణాటకలో పేసీఎం ప్రచారాన్ని కాంగ్రెస్ చేపట్టింది.


Next Story