- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అత్తను క్రూరంగా కొట్టి చంపిన కోడలు.. సంబంధం లేనట్లు నిల్చోని చూస్తోన్న కొడుకు (వీడియో)
దిశ, వెబ్డెస్క్: తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తమ పిల్లలకు కష్టం వస్తే తన కష్టంలా భావించి కష్టంలో తోడుతుంటుంది. అలాంటి ఓ తల్లిని కోడలు చితకబాదుతుంటే కన్న కొడుకు చూస్తూ నిల్చోవడం సోషల్ మీడియాలోని జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో కుటుంబ కలహాలతో మున్నీదేవి అనే వృద్ధురాలిని తన పెద్ద కోడలు కర్రలతో, రాళ్లతో దారుణంగా కొట్టింది. ఆ సమయంలో ఇంట్లోనే తన పెద్ద కుమారుడు అడ్డుకోకుండా కొడుతుంటే చూస్తూ నిల్చున్నాడు. తీవ్ర గాయాలపాలైన మున్నీ దేవి(55)ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తన పెద్ద కొడుకుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే గతంలో మున్నీ, పెద్ద కోడలిపై దాడి చేసిందని సమాచారం. అదే కోపంతో ఇప్పుడు ఆమెపై పెద్ద కోడలు దాడి చేసిందని సమాచారం.