మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్నో తెలుసా..?

by Disha Web Desk 12 |
మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్నో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అంతరించి పోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఆదివారం 227 రోజుల గరిష్ఠాన్ని తాకిన పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగాయి. భారత్ లో గడిచిన 24 గంటల్లో 636 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా మరో మూడు మరణాలు సంభవించాయని భారత ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా పెరిగిన కొత్త కరోనా కేసులతో దేశంలో ప్రస్తుతం 4,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా పాజిటివ్ కేసుల నమోదు తో పోలిస్తే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి రోజు రోజు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story

Most Viewed