- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోడీని ఫినిష్ చేస్తేనే అదానీ, అంబానీలు దూరం: కాంగ్రెస్ ఇంఛార్జ్ సంచలన వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ ఇంఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ, అంబానీలను దూరం పెట్టాలంటే ముందుగా మోదీని ఫినిష్ చేయాలి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బీజేపీని ఓడించాలని అన్నారు. తాజాగా రాజస్థాన్లో నిర్వహించిన సమావేశంలో సుఖ్జీందర్ సింగ్ రాంధ్వా మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి తన వ్యాపార మిత్రులకు లబ్ధి చేకూర్చేలా మోడీజీ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
మోడీజీ దేశం మొత్తాన్ని తన స్నేహితులకు అమ్మేశారని, ఫలితంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ గురించి మాట్లాడాల్సి ఉండగా అందరూ అదానీ గురించి మాట్లాడుతున్నారని రాంధ్వా అన్నారు. ఆయన దేశాన్ని నాశనం చేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ దేశాన్ని అమ్ముతోందని సుఖ్జీందర్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పోరాటం అదానీతో కాదని నేరుగా బీజేపీతో అని ఆయన అన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ జరిపించాలని ఆయన ఆరోపించారు.
మరోవైపు రాంధ్వా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మరోసారి కాంగ్రెస్ హద్దులు దాటిందని బీజేపీ నేత షెహజాద్ పునావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా పటేరియా మోడీని అంతం చేయమని ప్రజలను ప్రేరేపిస్తూ.. పుల్వామాలో పాకిస్తాన్కు క్లీన్ చీట్ ఇస్తున్నారని విమర్శించారు. ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఆయనను తొలగిస్తుందా లేదా రివార్డు ఇస్తుందా అని ప్రశ్నించారు.