- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాహుల్ 'జోడో యాత్ర'పై BJP యానిమేషన్ వీడియో
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' రాహుల్ గాంధీ నాయకత్వంలో నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతూ వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో యాత్రపై బీజేపీ పలురకాలుగా విమర్శలు చేస్తోంది. తాజాగా రాహుల్ యాత్రపై విమర్శనాత్మకంగా యానిమేషన్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ వీడియోలో దేశాన్ని ఏకం చేయడం కాదు ముందు మీ నాయకులను ఏకతాటి మీద నడిపించు అని అర్థం వచ్చేలా ఉంది. ఇటీవల కాంగ్రెస్లో గోవా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో జరిగిన సంక్షోభం చూపిస్తూ.. మొదటగా కాంగ్రెస్ను ఏకం చేయాలని సలహా ఇచ్చారు. వీడియో చివర్లో సోనియా గాంధీ వచ్చి ఓదార్చినట్లు పెట్టారు. ఈ వీడియోపై సుప్రియ ష్రినటే స్పందిస్తూ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం చూసి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని పెట్టిన దృష్టి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పై పెట్టి ఉంటే బాగుండని అన్నారు.