బల పరీక్షలో బీజేపీకి షాక్.. విజయం సాధించిన సీఎం..

by Dishanational4 |
బల పరీక్షలో బీజేపీకి షాక్.. విజయం సాధించిన సీఎం..
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం భగవంత్ మన్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించింది. అయితే 'అపరేషన్ కమల్' పేరుతో ఒక్కొక్కరికి రూ.25 కోట్ల ఆఫర్‌తో ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం భగవంత్ మన్ విశ్వాస ఓటు వేయడానికి రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. గత నెల 27న గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ సమావేశానికి ఆమోదం తెలిపిన రెండు రోజుల తర్వాత, అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆప్‌, బీజేపీ ఎమ్మెల్యేలను చేతులు ఎత్తాలని కోరాగా ఆప్‌కు బలం చేకూరడంతో.. విశ్వాస తీర్మానానికి పంజాబ్ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.


Next Story

Most Viewed