- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నిలిపి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో 10 మంది మృతృవాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే, వడోదర నుంచి అహ్మదాబాద్కు వెళ్తున్న మారుతీ సుజుకీ ఎర్టిగా కారు నదియాడ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాడియాడ్ ఎమ్మెల్యే పంకజ్ దేశాయ్ మాట్లాడుతూ ఎక్స్ప్రెస్వేలోని ఎడమ లేన్లో ట్యాంకర్ ఏదో సాంకేతిక లోపంతో ఆగిపోయింది, కారు వేగంగా ఉండటంతో డ్రైవర్కు బ్రేకులు వేయడానికి తగినంత సమయం లభించక దానిని ఢీకొట్టారని చెప్పారు.